మదనపల్లె: వృద్ధి చెందుతున్న అప్పారెల్, యాక్ససరీస్ ప్రత్యేక చైన్ రిలయన్స్ ట్రెండ్స్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో తమ రెండవ నూతన స్టోర్ని ప్రారంభించింది. 9200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ నూతన ట్రెండ్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉందని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. అలాగే ఈ స్టోర్ మదనపల్లె ప్రాంతపు వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, అందుబాటైన ధరలో, తాము చెల్లించిన ధరకు అత్య అధిక విలువని కలిగి ఉందన్నారు. ఆధునిక ఉమెన్స్ వేర్, మేన్స్ వేర్, కిడ్స్ వేర్ ఫ్యాషన్ యాక్ససరీస్ ఉన్నాయన్నారు. ప్రత్యేకమైన ప్రారంభోత్సవపు ఆఫర్ కింద రూ.3499 షాపింగ్ చేస్తే రూ.199కి ఒక బహుమతి, రూ.2999 కొనుగోలుపై రూ.3000 విలువగల కూపన్లు పూర్తి ఉచితంగా పొందగలుగుతారని చెప్పారు.