హైదరాబాద్ : రియల్మి సంస్థ తాజాగా భారతీయ మార్కెట్లోకి రియల్మి జిటి 5జి సిరీస్, మొట్టమొదటి లాప్ టాప్ రియల్మి బుక్ (స్లిమ్)లను ప్రవేశపెట్టింది. రియల్మి జీటీ 5జీ సిరీస్లో ‘రియల్మి జీటీ 5జీ, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ 5జీ’ పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. రియల్మి జిటి 5జి అనేది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 888 5జి ప్రాసెసర్తో శక్తివంతమైంది. 120 హెచ్జెడ్ సూ పర్ డిస్ప్లేను కలిగిఉంటుంది. 65 డబ్ల్యూ సూపర్ డార్ట్ ఛార్జ్, 4500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, సోనీ 64 ఎం పీ ట్రిపుల్ కెమెరా ఉంటాయి. డాషింగ్ సిల్వర్, డాషింగ్ బ్లూ రంగుల్లో లభ్యమవుతుంది. 8 జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ రకం ధర రూ.37,999. డ్యూయల్ టోన్ వెగాన్ లెదర్ డిజైన్ వేరియంట్, రేసింగ్ ఎల్లో లో 12జీబీ ప్లస్ 256 G స్టోరేజ్ రకం ధర రూ. 41,999. రియల్మి.కామ్, ఫ్లిప్ కార్ట్, మెయిన్ లైన్ చానల్స్లో ఆగస్టు 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. రియల్మి జీటీ మాస్టర్ ఎడిషన్ 5జి అనేది తాజా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778జి 5జి ప్రాసెసర్తో శక్తివంతమైంది.