హైదరాబాద్ : అగర్ బత్తిల తయారీ అగ్రగామి బ్రాండ్లలో ఒకటైన మోక్ష్ అగర్ బత్తి తన ప్రచారకర్తగా లెజండరీ నటి మాధురీ దీక్షిత్ను నియమించింది. ఈ ప్రఖ్యాత కంపెనీ విస్తృత శ్రేణి ప్రార్థన ఉత్పత్తులకు ప్రచారం చేయనున్నారు. తమ విశిష్ట పరిమళాలకు పేరొందిన అగర్ బత్తి, ధూప్ లాంటివి వీటిలో ఉన్నాయి. మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ, ‘‘మోక్ష్ అగర్ బత్తికి ప్రాధాన్యం వహించడం నాకెంతో ఆనందదాయకమని, స్వాభావపరంగా ఫ్లోరల్, ఉడీ, స్పైసీ, ఫ్రూటీగా ఉండే అత్యుత్తమ పరిమళాలతో అగర్ బత్తిని ఆవిష్కరించడంలో అగ్రగామిగా ఉన్న బ్రాండ్ ఇదేనని అన్నారు. అగర్ బత్తి విభాగంలో ఈ సంస్థకు సంబంధించిన స్వర్ణ చంపా, ఆకాశ్ ఫూల్, సమాజ్ వంటి మార్కెట్ అగ్రగాములుగా ఉన్నాయని, బ్రాండ్ విశిష్ట పరిమళాలతో దేశవ్యాప్తంగా ఇది కొనుగోలుదారులను కలిగి ఉందని మోక్ష్ అగర్ బత్తి సీఈఓ ఆనంద్ కుమార్ అషియా అన్నారు.