Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘మౌకా హై’ ప్రత్యేకగీతం విడుదల

దీల్లీ ః అజాదీ కీ అమృత్‌ మహోత్సవ్‌ను భారతదేశం వేడుక చేసుకుంటున్న వేళ, దాల్మియా భారత్‌ గ్రూప్‌, భూషణ్‌ కుమార్‌ టీ-సిరీస్‌లు ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రత్యేక గీతం విడుదల చేసి దేశ ప్రజలలో ఆ స్ఫూర్తిని రగిలించాయి. ‘మౌకా హై’ శీర్షికన విడుదల చేసిన ఈ గీతాన్ని బీ ప్రాక్‌ ఆలాపించగా, రోచక్‌ కోహ్లీ స్వరపరిచారు. మనోజ్‌ ముంతాషిర్‌ గీత రచన చేశారు. ఈ స్ఫూర్తిదాయక వీడియోలో విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు కూడా కనిపిస్తారు. వీరిలో మీరాభాయ్‌ చానూ, పీవీ సింధు, హిమ దాస్‌తో పాటుగా మరెంతో మంది ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img