హైదరాబాద్ : ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఇఎక్స్)లో విద్యుత్ మార్కెట్ సరికొత్త మైలురాయిని సాధించింది. మునుపెన్నడూ లేనటువంటి అత్యధిక రికార్డు నెలవారీ వాల్యూమ్ 9538 ఎంయుతో ఆగస్టు’21 లో 74 వైఓవై వృద్ధిని సాధించింది. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ప్రచురించిన పవర్ డిమాండ్ డేటా ప్రకారం, ఆగస్టు’21 లో 196 ఎంయు వద్ద జాతీయ గరిష్ట డిమాండ్ 17 శాతం వైఓవై పెరిగింది, 129.51 ఎంయు వద్ద ఇంధన వినియోగం కూడా 17 శాతం వైఓవై వృద్ది సాధించింది. ఒక వైపు, ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాల అభివృద్ధి విద్యుత్ డిమాండ్ పెరుగుదలకు దారితీసింది, మరోవైపు దిగుమతి చేసుకున్న బొగ్గు, ఎల్ఎన్జి అధిక వ్యయంతో పాటు తక్కువ పవన విద్యుత్ ఉత్పత్తి వంటి సరఫరా వైపు గల అవరోధాలు ఎక్స్ఛేంజ్లో కనుగొనబడిన విద్యుత్ ధరల పెరుగుదలకు దారితీసింది. అయితే మార్కెట్ మరింత సౌకర్యవంతంగా, పోటీగా, పారదర్శకంగా మరియు సమర్ధవంతంగా పెరిగిన విద్యుత్ డిమాండ్ను పరిష్కరించడంలో పంపిణీ యుటిలిటీలు, పరిశ్రమలను సులభతరం చేయడానికి నిరంతరాయంగా పని చేస్తూనే ఉంది.