ముంబయి ః స్మార్ట్ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తాజాగా గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ, గెలాక్సీ ట్యాబ్ ఏ7ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ రెండు ఉపకరణాలూ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ పోర్ట్ఫోలియోకు తాజా జోడిరపులు. ఈ రెండూ కూడా వినియోగదారుల ఉత్పాదకత, సృజనాత్మకత, వినోద అవసరాలను తీరుస్తాయి. గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ తనతో పాటుగా గెలాక్సీ ట్యాబ్ ఎస్8ప్లస్ నుంచి అభిమానులు ఇష్టపడే ఫీచర్లను తీసుకువస్తుంది. వీటిలో భారీ డిస్ప్లే, పని, అభ్యాసం, డిజైన్ మరియు వినోదం కోసం ఎస్ పెన్ ఇన్ ద బాక్స్ కూడా ఉంటాయి. గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్ కంపాక్ట్ డిజైన్, ఫీచర్లు దీనిని ప్రయాణ సమయాలలో వినోదం మరియు గేమింగ్కు అత్యుత్తమ ఉపకరణంగా మారుస్తుంది.