హైదరాబాద్ : స్మార్ట్ఫోన్ బ్రాండ్ శాంసంగ్ ఇండియా తాజాగా గెలాక్సీ ఏ03ఎస్ను ఆవిష్కరించింది. శాంసంగ్ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లలో తాజా విడుదల గెలాక్సీ ఏ03ఎస్. దీనిలో అత్యద్భుతమైన 6.5అంగుళాల ఇన్ఫినిటీ వీ-డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ కెమెరా, భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, శక్తివంతమైన ఆక్టాకోర్ మీడియా టెక్ పీ35 ప్రాసెసర్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, హాజ్ మరియు మ్యాటీ టెక్చర్ డిజైన్, పలు వినూత్నమైన ఫీచర్లు ఉన్నాయి. గెలాక్సీ ఏ03ఎస్తో శాంస్గంగ్ ఈ విభాగంలో అసాధారణ ఫీచర్లను తీసుకువచ్చింది. గెలాక్సీ ఏ03ఎస్ ధర 3జీబీం32 జీబీ వేరియంట్కు 11499 రూపాయలు కాగా 4జీబీం64జీబీ వేరియంట్కు 12499 రూపాయలు.