Friday, April 19, 2024
Friday, April 19, 2024

శాంసంగ్‌ లాయల్టీ కార్యక్రమం ‘శాంసంగ్‌ హోమ్‌’

హైదరాబాద్‌ ః భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే కన్స్యూమర్‌ ఎలక్టాన్రిక్స్‌ బ్రాండ్‌లలో ఒకటైన శాంసంగ్‌ తాజాగా వినూత్నమైన కన్స్యూమర్‌ లాయల్టీ కార్యక్రమాన్ని ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించింది. ‘శాంసంగ్‌ హోమ్‌’గా ఈ లాయల్టీ కార్యక్రమాన్ని పిలుస్తున్నారు. ఈ వినూత్నమైన కన్స్యూమర్‌ లాయల్టీ కార్యక్రమాన్ని ప్రస్తుత శాంసంగ్‌ వినియోగదారులకు ప్రోత్సాహకాలను అందించే రీతిలో తీర్చిదిద్దారు. దీని ద్వారా అందుబాటు ధరలోని ప్రయోజనాలను అందించనున్నారు. తద్వారా శాంసంగ్‌ కన్స్యూమర్‌ ఎలక్టాన్రిక్స్‌ ఉత్పతత్తులపై వినియోగదారుల ప్రేమ, వారు చూపే ఆదరణను గుర్తించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img