ముంబయి: భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్టాన్రిక్స్ బ్రాండ్ శాంసంగ్ తాజాగా తమ అత్యాధునిక గెలాక్సీ జెడ్ సిరీస్ను భారతదేశంలో విడుదల చేసింది. నాల్గవ తరపు ఫోల్డబుల్స్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్4లు ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లతో పాటుగా ఆన్లైన్లో ముందస్తు బుకింగ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ జెడ్ సిరీస్ అత్యుత్తమ టూల్స్ను ఉత్పాదకత, స్వీయ వ్యక్తీకరణ పరంగా అందిస్తుంది . గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ శక్తివంతమైన స్మార్ట్ఫోన్ ఆవిష్కరణల ఫలితం. దీనిలో ప్రతిష్టాత్మకమైన కెమెరా, అత్యంత వేగవంతమైన ప్రాసెసర్, పూర్తి సరికొత్త డిజైన్ ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 అత్యంత శక్తివంతమైన స్మార్ట్ఫోన్. గెలాక్సీ జెడ్ 4 ఫ్లిప్4 కంపాక్ట్ కామ్షెల్ డిజైన్ వినూత్న అనుభవాలను అందిస్తుంది. దీని ఫ్లెక్స్కామ్ ద్వారా హ్యాండ్స్ ఫ్రీ వీడియోలను తీయవచ్చు.