ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ తన అత్యాధునిక ఫోల్డబుల్ శ్రేణి గెలాక్సీ జెడ్ ఫ్లిప్4, గెలాక్సీ జెడ్ ఫోల్డ్4 కోసం గణనీయంగా గుర్తించదగ్గ ముందస్తు-బుకింగులను స్వీకరించింది. ఇండియాలో, నాల్గవ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లు, కొత్త ఉపకరణాల పట్ల బలమైన ఆసక్తిని సూచిస్తూ గత సంవత్సరపు ముందస్తు-బుకింగ్ రికార్డులను బద్దలు కొట్టాయి. ఇప్పుడు ముందస్తు బుకింగ్ దశ ముగిసినందువల్ల, ఇండియాలోని వినియోగదారులు శామ్సంగ్.కామ్, అగ్రగామి ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైల్ స్టోరులలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్4, గెలాక్సీ జెడ్ ఫోల్డ్4లను కొనుగోలు చేసుకోవచ్చునని శామ్సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ అన్నారు.