గురుగ్రామ్: ప్రముఖ ఎలెక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్ సరికొత్త పికిల్ మోడ్ మైక్రోవేవ్ని ప్రవేశపెట్టింది. దీనిలో వినియోగదారులు అనేక సంవత్సరాలపాటు చేతితో, ఎండలో-ఆరబెడుతూ పచ్చళ్ళు చేసుకుంటూ వస్తున్న విసుగు, అంతరాయం లేకుండా తమకు ఇష్టమైన పచ్చళ్ళను తయారు చేసుకోవచ్చు. గృహిణులు, ఆధునిక కాలం అమ్మాయిలు, పనిచేస్తున్న మహిళల కొరకు రూపొందించబడిన ఈ కొత్త మైక్రోవేవ్, ఈ నవీనమైన పికిల్ మోడ్తో, వినియోగదారులు అనేక రకాల పచ్చళ్ళను తమకు సౌకర్యంగా తమ ఇంటివద్దనే సంవత్సరం పొడవునా పరిశుభ్రంగా చేసుకోవడానికి వీలు కలిగిస్తుంది. సరికొత్త మైక్రోవేవ్ ఇప్పుడు రూ.24,990/-ధరతో 28-లీటర్ల సామర్థ్యంతో లభిస్తోందని శామ్సంగ్ ఇండియా, కన్స్యూమర్ ఎలెక్ట్రానిక్స్ బిజినెస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్దీప్ సింగ్ తెలిపారు.