Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సిద్స్‌ ఫార్మ్‌ ఏ2 దేశీ ఆవు పాలు విడుదల

విశాలాంధ్ర/హైదరాబాద్‌: తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌, భారతదేశపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఏ2 దేశీ ఆవుపాలను హైదరాబాద్‌లోని వినియోగదారుల కోసం విడుదల చేసింది. ఏ2 ఆవుపాలకు ఉన్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని కంపెనీ ప్రీ బుకింగ్‌ను అందుబాటులో ఉంచగా, కేవలం ఆరు గంగటలలో 400కు పైగా వినియోగదారులు 350 లీటర్లకు పైగా పాలను బుక్‌ చేసుకున్నారు. సిద్స్‌ ఫార్మ్‌ ఈ దేశీ ఆవు పాలను 500 మిల్లీ లీటర్ల ప్యాక్‌ 75రూపాయల ధరలో విక్రయిస్తుంది. ఏ2 పాలకు మరియు సాధారణ పాలకు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే, సాధారణ పాలలో ఏ1 బీటా కాసిన్‌ ఉంటే , ఏ2 పాలలో కేవలం ఏ2 బీటా కేసిన్‌ ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ఏ2 పాలను ఎక్కువ మంది అభిమానిస్తుంటారని సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img