Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

స్కూలు ఫీజులకు ఫైనాన్స్‌ పీర్‌ ఆర్థికసాయం

హైదరాబాద్‌ : కరోనా కష్టకాలంలో పిల్లలకు స్కూలు ఫీజులు చెల్లించలేని పరిస్థితులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు ఊరటగా ఫీజుల చెల్లింపు బాధలను తొలగించేందుకు అగ్రగామి ఫిన్‌ టెక్‌ కంపెనీ ఫైనాన్స్‌ పీర్‌ ఆంధ్ర్రప్రదేశ్‌, తెలంగాణలలో 250కి పైగా విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సున్నా వ్యయంతో, సున్నా వడ్డీ ఈఎంఐలకు ఫీజు ఫైనాన్స్‌ చేయనుంది. ఇప్పటి వరకూ సంస్థ 1,50,000 మందికి పైగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఫీజు ఫైనాన్సింగ్‌ పరిష్కరాలను అందించింది. తమ చదువులు కొనసాగించేలా రక్షణ కల్పించుకునేందుకు ఫైనాన్స్‌ పీర్‌ ఉచిత బీమా సదుపాయాలను కూడా అందిస్తోంది. నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే తమ ఆశయమని ఫైనాన్స్‌ పీర్‌ వ్యవస్థాపకుడు రోహిత్‌ గజ్‌ భాయి, సహ వ్యవస్థాపకుడు సునీత్‌ గజ్‌ భాయ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img