Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్పాటాన్‌ను సొంతం చేసుకున్న డెలివరీ

హైదరాబాద్‌ : భారతదేశంలో సుప్రసిద్ధ ఎండ్‌-టు-ఎండ్‌ లాజిస్టిక్స్‌, సరఫరా శ్రేణి సేవల కంపెనీ డెలివరీ, బెంగళూరు కేంద్రంగా కలిగిన స్పాటాన్‌లాజిస్టిక్స్‌ను సొంతం చేసుకున్నట్లు వెల్లడిరచింది. ఇది డెలివరీ యొక్క ప్రస్తుత బీ2బీ సామర్థ్యంలను మరింతగా వృద్ధి చేయనుంది. ఈ అంశమై డెలివరీ సీఈవో సాహిల్‌ బారువా మాట్లాడుతూ ‘‘ వృద్ధి ఆధారితంగా ఉండటంతో పాటుగా మా వ్యాపార శ్రేణిలో ప్రతి అంశంలోనూ విస్తరించాలనే మా లక్ష్యంకు అనుగుణంగా ఈ అభివృద్ధి జరిగింది. గత 10 సంవత్సరాలుగా, బీ2సీ లాజిస్టిక్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న డెలివరీ, ఇప్పుడు మా సొంతమైన ట్రక్‌లోడ్‌ వ్యాపారాన్ని స్పాటాన్‌తో మిళితం చేశాం. తద్వారా బీ2బీ ఎక్స్‌ప్రెస్‌లో కూడా అదే స్థానం పొందగలమని ఆశిస్తున్నట్లు స్పాటాన్‌ లాజిస్టిక్స్‌ మేనేజింగ్‌ డ్కెరెక్టర్‌ అభిక్‌ మిత్రా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img