హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సిఆర్బిఇ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ ‘‘తెలంగాణ- భారతదేశంలోని పారిశ్రామిక అండ్ వేర్ హౌసింగ్కు ఒక ప్రకాశవంతమైన కేంద్రం’’ అనే నివేదికను ఆగస్టు 14న హైదరాబాద్లో క్రెడాయ్తో కలిసి నిర్వహించిన ఒక ప్రాపర్టీ షోలో విడుదల చేసింది. ఇ-కామర్స్, 3 పిఎల్ ప్లేయర్ల ద్వారా వృద్ధి చెందుతున్న డిమాండ్తో పాటు వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక నేపథ్యం కలిగిన హైదరా బాద్లో గోదాముల కార్యకలా పాలు విస్తరించేందుకు అవకాశం ఏర్పడిరది. రాష్ట్ర రాజధానిలో కీలకమైన మౌలిక సదుపాయాలు ఉన్నందున, తెలంగాణలో గోదాముల విభాగాన్ని ముందుకు తీసుకు వెళడంతో హైదరాబాద్ ఎలా కీలకపాత్ర పోషించిందనే అంశాన్ని వివరించారు. సిబిఆర్ఇ నివేదిక ప్రకారం, 2018-హెచ్1లో హైదరాబాద్లో గోదాములు దాదాపు 11 మిలియన్ చ.అడుగుల విస్తీర్ణంలో ఉండగా, లీజింగ్ ప్రధానంగా సెమీ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ప్రాపర్టీలలో కేంద్రీకృతమై ఉంది.