హైదరాబాద్ : వైఫై ప్రాజెక్టులో భాగంగా యాక్ట్ ఫైబర్నెట్ భాగస్వామ్యంతో‘డిజిటల్ తెలంగాణ’ను మరింత వేగవంతం చేసే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో బుధవారం 3,000 పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను ప్రారంభించింది. తెలంగాణ పరిశ్రమలు, సమాచార సాంకేతిక (ఐటి) శాఖ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి కె.టి.రామారావు, తెలంగాణ ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్,అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలా మల్లాది, తదితర ప్రముఖులు, ఇతర అధికారుల సమక్షంలో ఈ వైఫై హాట్ స్పాట్స్ సేవలను ప్రారంభించారు.