కర్నూలు: ఒయాసిస్ ఫెర్టిలిటీ తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా కర్నూలులో అడుగు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన 5వ కేంద్రాన్ని ప్రారంభించింది. ఒయాసిస్ ఫెర్టిలిటీ కర్నూలులో ప్రపంచ స్థాయి ఐవీఎఫ్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించింది. విజయవాడ, వైజాగ్, గుంటూరు, ఒంగోలుల తర్వాత రాష్ట్రంలో ఇది 5వది. పురుషులు, మహిళలు ఇద్దరికీ వ్యక్తిగతీకరించిన అత్యంత అధునాతన సంతానోత్పత్తి చికిత్సలను అందించే ప్రపంచ-స్థాయి ఐవిఎఫ్ ల్యాబ్తో ఈ కేంద్రం సిద్ధంగా ఉన్నది. డాక్టర్ వహిదా, ప్రొఫెసర్, హెచ్ఒడి, విశ్వభారతి మెడికల్ కళాశాల, కర్నూలు, కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు, డాక్టర్ జ్యోతిర్మయి, ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్, విశ్వభారతి వైద్య కళాశాల, కర్నూలు మరియు డాక్టర్ కిరణ్ కుమార్ స్పయిన్ సర్జన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ దుర్గా జి రావు, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ విజయలక్ష్మి, సుధాకర్ జాదవ్ పాల్గొన్నారు.