హైదరాబాద్: ప్రపంచంలోనే మొదటి, భారతదేశంలో అత్యంత ప్రీమియం కంట్రీ చికెన్ బ్రాండ్ ‘కంట్రీ చికెన్ కో’ 7వ అవుట్లెట్ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు కోడి రుచి అమోఘమన్నారు. ఈ బ్రాండ్ మరింతగా విస్తరించాలన్నారు. జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్, మాదాపూర్, వి పూజిత గౌడ్, కార్పొరేటర్, హఫీజ్ పేట, సందీప్ కుమార్ సుల్తానియా, సెక్రటరీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ పాల్గొన్నారు.