ముంబయి: కియా ఇండియా దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న కారు తయారీదార్లలో ఒకటి, నేడు శ్రేణిలో ప్రముఖమైన తన స్మార్ట్ అర్బన్ కాంపాక్ట్ ఎస్ యూవీ యొక్క ‘ఎక్స్-లైన్ ట్రిమ్’, కియా సోనెట్ను పరిచయం చేసింది. సోనెట్ బ్యాడ్జ్ స్పోర్టీ, చురుకైన అప్పీలును మెరుగుపరుస్తూ, సోనెట్ ఎక్స్-లైన్ ట్రిమ్ ‘ఎక్స్ క్లూజివ్ మ్యాటీ గ్రాఫైట్ ఎక్స్ టీరియర్ రంగు’ లో అందించబడిరది, ఇది కారు యొక్క పూర్తి ప్రీమియం అంశాన్ని పెంచింది. దీని ఎక్స్ క్లూజివ్ వైభవోపేతమైన సేజ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ మరియు బ్లాక్ హై గ్లాస్ (ఆర్ 16- 40.64 సెం.మీ (16’’) ఎక్స్ క్లూజివ్ క్రిస్టల్ కట్ అల్లోయ్స్తో, సోనెట్ ఎక్స్-లైన్ పూర్తి కేబిన్ మరియు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత పెంచుతుంది. ఇది 7 డీసీటీ ఆకృతితో 1.0 టి-జీడీఐ ఇంజన్ మరియు 6ఏటీ ఆకృతితో 1.5 లీటర్ సీఆర్ డీఐ డీజిల్ ఇంజన్తో ప్రత్యేకించి అందించినట్లు కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యూంగ్-సిక్ సోన్ తెలిపారు.