న్యూఢల్లీి: దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కారు తయారీదారులలో ఒకటైన కియా ఇండియా, కేవలం 3 సంవత్సరాలలో 5,00,000 దేశీయ సేల్స్ మైలురాయిని అధిగమించి సరికొత్త ప్రామాణాన్ని నెలకొల్పింది. ఈ విజయాన్ని సాధించడానికి భారతదేశంలో అతి వేగవంతమైన కారు తయారీదారుగా చేసింది. ఎగుమతులతో సహా, కియా ఇండియా వారి మొత్తం పంపిణీలు అనంతపురం తయారీ సదుపాయం నుండి 6,34,224 యూనిట్స్కి పెరిగింది. కారెన్స్ శక్తివంతమైన సామర్థ్యం మద్దతుతో, కంపెనీ తమ స్థానాన్ని కేవలం 4.5 నెలల్లో ఆఖరి 1 లక్ష సేల్స్ సంపాదించింది. భారతదేశపు మార్కెట్ లో తమ శక్తివంతమైన పనితీరుతో, కంపెనీ ఇప్పుడు కియా కార్పొరేషన్ యొక్క అంతర్జాతీయ సేల్స్ కి 6% తోడ్పాటు అందించింది.