Friday, April 19, 2024
Friday, April 19, 2024

అందరిపై దయ చూపించండి: సమంత

హైదరాబాద్‌: మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత కొంతకాలంగా ఇంటికే పరిమితమై ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఇటీవల కాస్త కోలుకున్న ఆమె సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయ్యారు. ఈ మధ్యనే రెండుసార్లు మీడియా ముందుకు కూడా వచ్చి భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా సోషల్‌ మీడియా ఆసక్తికర పోస్ట్‌ చేశారు సమంత. బాక్సింగ్‌ ప్రాక్టీస్ట్‌ చేస్తున్న ఫొటో షేర్‌ చేసి ‘అందరిపై దయ చూపించండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు. ‘ఎవరు ఏ సమస్యతో పోరాడుతున్నారో తెలీదు. అందుకే అందరి పై దయ చూపించండి’’ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు అభిమానులు ‘మీలాగే మీ మనసు కూడా అందమైంది’ అని కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ కూడా సామ్‌పై ప్రశంసలు కురిపించారు. తాజా ఇంటర్వ్యూలో మనోజ్‌ సమంత గురించి మాట్లాడారు. ‘జీవితంలో సమస్యలు అనేవి సహజంగా ఉంటాయి. గుండె నిబ్బరంతో ఏదీ పట్టించుకోకుండా ముందుకు సాగిపో’’ అని సామ్‌కు ధైర్యం చెప్పారు. అంతే కాకుండా సమంతతో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి చెప్పుకొచ్చారు. ‘‘సమంత చాలా కష్టపడి పనిచేస్తుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ చేస్తున్న సమయంలో ఆమె పనితీరు చూసి ఆశ్చర్యపోయాను. ఇచ్చిన సీన్‌ బాగా రావడం కోసం శరీరాన్ని ఎంత కష్టపెట్టడానికైనా తను సిద్ధపడుతుంది’’ అని అన్నారు. సమంత కీలక పాత్రలో నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వహిస్తున్న ‘ఖుషి’ చిత్రంలోనూ సామ్‌ నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ప్రారంభం కానుందని దర్శకుడు ఇటీవల ప్రకటించారు. అలాగే బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్‌’ అనే వెబ్‌సిరీస్‌లో కనిపించనుంది సమంత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img