హైదరాబాద్ : టాలీవుడ్ హీరో రామ్ చరణ్తో కలిసి అగ్రశ్రేణి దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న చిత్ర షూటింగ్ బుధవారం ప్రారంభ మైంది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి, అగ్ర దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథి లుగా హాజరై సందడి చేశారు. హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అడ్వాణీపై ముహూర్తపు సన్నివేశానికి చిరు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శంకర్, రామ్చరణ్, కియారా అడ్వాణీ, సునీల్, శ్రీకాంత్, అంజలి, నిర్మాత దిల్రాజు, సంగీత దర్శకుడు తమన్ సహా పలువురు ఉన్నారు. సూట్, కళ్లజోడు ధరించి చేతిలో ఫైల్స్ పట్టుకుని స్టైలిష్ ఆఫీసర్స్లా వీళ్ల లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్కు ‘మేము వస్తున్నాం’? అంటూ వ్యాఖ్యను జోడిరచారు. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.