హైదరాబాద్ : ఆది సాయికుమార్ కొత్త కథలకు ప్రాధాన్యతనిస్తూ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఒక మిర్రర్ లో ఒక యువ జంట చాలా చేరువగా కనిపిస్తూ ఉండటంతో, ఆ మిర్రర్ లోకి ఆత్రుతగా వెళ్లడానికి హీరో ట్రై చేస్తున్నట్టుగా ఈ ఫస్టులుక్ పోస్టర్ ఉంది. కథ ఏమిటి? పాత్రల స్వరూప స్వభావాలేమిటి? అనే విషయాలు పక్కన పెడితే, ఈ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించిన ఈ సినిమా ద్వారా, పొలిమేర నాగేశ్వర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా ద్వారా, ‘నువేక్ష’ కథానాయికగా పరిచయమవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు తెలియనున్నాయి.