Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

అప్పుడు బయటకు రావాలనిపించలేదు: సమంత

హైదరాబాద్‌: మయోసైటిస్‌ వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటు న్నట్లు సమంత తెలిపారు. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’ గుణశేఖర్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తాజాగా ఆరోగ్య పరిస్థితి గురించి సామ్‌ చెప్పుకొచ్చారు. ‘మయోసైటిస్‌’ నిర్ధారణ అయిన తొలిరోజుల్లో చాలా బలహీనంగా అనిపించేది. ‘యశోద’ చిత్ర సమ యంలో ఆరోగ్యం ఇంకా వీక్‌ అయింది. అలాగే ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నా. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఓపిక ఉండేది కాదు. ఎన్నో మందులు తీసుకోవాల్సి వచ్చేది. సినిమా నా భుజాలపై ఉండటంతో బాధ్యతగా భావించి అతి కష్టంగానే ఒక ఇంటర్వ్యూ అయినా చేయాలనుకున్నా. ఆ తర్వాత క్రమంలో నా ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. ఇప్పుడు ‘శాకుంతలం’ కోసం ఆరోగ్యం సహకరిస్తోంది. మయోసైటిస్‌ నుంచి కోలుకుంటూ ధైర్యంగా ఉన్నా’’ అని సమంత తెలిపింది. గుణశేఖర్‌ శాకుంతలం కథ చెప్పగానే వెంటనే సున్నితంగా తిరస్కరించానని సమంత వెల్లడిరచారు. ఇందుకు మూడేళ్లుగా తనలో ఉన్న భయమే కారణమన్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌సిరీస్‌ తర్వాత శాకుంతలం కథ విన్నానని, కానీ గుణశేఖర్‌ ఒప్పించి ఈ చిత్రంలో చేయించారని వివరించారు. ఇందులోని పాత్ర ఆహార్యం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. అలాగే తన వ్యాయామాలు, వర్కవుట్‌లు, డైట్‌ కూడా మార్చుకున్నట్లు సమంత వివరించారు. శాకుంతలం చిత్రాన్ని వదులుకుంటే తన కల సాకారమై ఉండేది కాదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img