హైదరాబాద్ : ‘నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం.. ఈ మాటలు నాకు ‘స్వర్ణకమలం’ రోజుల్ని గుర్తు చేస్తున్నాయి’ అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్ అన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యా రాజు ప్రధాన పాత్రలో నటించిన ‘నాట్యం’లోని ఓ సరికొత్త పాటను తాజాగా వెంకటేష్ విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ‘పోనీ పోనీ ఈ ప్రాణమే.. కళకై జరిగే ఓ త్యాగమే’ అంటూ లలిత కావ్య ఆలపించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ లో కమల్ కామరాజ్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అక్టోబర్ 22న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.