Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఇది.. అందరూ కోరుకునే ఆరంభం..

మీరాభాయ్‌ చాను విజయంపై మహేష్‌, పవన్‌

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల వేట మొదలైంది. శనివారం వెయిట్‌ లిఫ్టింగ్‌లో మణిపూర్‌కి చెందిన మీరాబాయి చాను దేశానికి రజత పతకాన్ని అందించింది. ఈ సందర్భంగా మీరాభాయ్‌ కృషి ప్రోత్సహిస్తూ.. సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. మహేష్‌ బాబుతో పాటు.. పవర్‌స్టార్‌, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ కూడా మీరాభాయ్‌ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘ఇలాంటి క్షణం కోసమే కదా.. ఎంతోకాలంగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తుంది. ఇది అందరూ కోరుకునే ఆరంభం..మీరాభాయ్‌ చానుకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్షన్‌ ఇప్పుడే మొదలైంది’ అంటూ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి మెడల్‌ సాధించినందుకు మీరాభాయ్‌కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారని.. జనసేన పార్టీ ట్వీట్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img