Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎన్టీఆర్‌ జోడీగా జాన్వీ కపూర్‌?

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే సెట్స్‌ పైకి వెళ్లవలసిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’తో ఎన్టీఆర్‌ కి వచ్చిన పాన్‌ ఇండియా క్రేజ్‌ కి తగినట్టుగా స్క్రిప్ట్‌ ను మార్చడానికి కొరటాల కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడనేది ఎక్కువగా వినిపించిన టాక్‌. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ – యువసుధ ఆర్ట్స్‌ వారు కలిసి భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ను నిర్ణయించలేదు. వచ్చేనెల నుంచి రెగ్యులర్‌ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా కొంతమంది పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఆ జాబితాలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ పేరు కూడా ఉంది. అయితే తెలుగు సినిమాలకి సంబంధించి ఆమె పేరు చాలా కాలంగా నానుతూ ఉండటం వలన, జనాలకు అంత నమ్మకం కలగలేదు. కానీ ఈ సినిమాకి జాన్వీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే టాక్‌ బలంగానే వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. అనిరుధ్‌ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, 2024 ఏప్రిల్‌ 5వ తేదీన విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img