ముంబై : తన తదుపరి చిత్రం ‘ఎమర్జెన్సీ’ కోసం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఆస్తులన్నీ తనఖా పెట్టారట. ఈ చిత్రం షూటింగ్ పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడిరచారు. ‘ఒక నటిగా ఈ రోజు ఎమర్జెన్సీ షూట్ పూర్తిచేశాను. నా జీవితంలోని అద్భుతమైన ఘట్టం చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా కోసం ఎలాంటి ఇబ్బందిపడలేదని అంతా భావిస్తున్నారు. కానీ నిజం వేరు. నాకు సంబంధించిన ఆస్తులన్నింటినీ తనఖా పెట్టాను. మొదటి షెడ్యూల్ సమ యంలో డెంగీ బారినపడ్డాను. రక్తకణాల సంఖ్య భారీగా పడిపోయినా, నేను ఆ షూట్లో పాల్గొనాల్సి వచ్చింది. అది నాకెంతో క్లిష్టంగా మారింది’ అంటూ ఆ సినిమా కోసం ఆమె పడిన కష్టాన్ని వెల్లడిరచారు. అలాగే ఇది తనకు పునర్జన్మ అని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న బాలీవుడ్ చిత్రం ‘ఎమర్జెన్సీ’ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దు కుంటోంది. ఇందులో కంగన.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.