హైదరాబాద్: విష్వక్సేన్ నటించిన తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ సినిమాకు దర్శక నిర్మాత కూడా ఆయనే . ‘ఉగాది’ సందర్భంగా ఈ సినిమాను మార్చి 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో విష్వక్ బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో విశ్వక్ మాట్లాడుతూ .. ‘‘ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేశాను .. ఇలా చేయడం మొదటిసారి. రెండు పాత్రలు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. అందువలన ఒకేసారి రెండు సినిమాలు చేసి నట్టుగా అనిపించింది. ఈ ఒక్క సినిమా కోసమే ఏడాదిన్నర పట్టింది. హీరోగా మాత్రమే అయితే ఈ పాటికి 3 సినిమాలు చేసేవాడిని’’ అని అన్నాడు. ప్రేక్షకులు ఈ సినిమా మొదటి అర్థభాగంలో ఎఎంత నవ్వుకుంటారో, ఆ తరువాత అంత టెన్షన్ పడతారన్నాడు. ఈ సినిమాలోని పాటలను చాలా రోజుల ముందుగానే ఒకదాని తరువాత ఒకటిగా విడుదల చేశానని, ‘పడిపోయిందే పిల్లా’ అనే పాట అంటే నాకు చాలా ఇష్టమని తెలిపారు. నివేదా పేతురాజ్ కథ విన్న తరువాతనే చేయడానికి ఓకే అన్నారు. తన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంతవరకూ చూడని ఒక కొత్త నివేదాను ఇప్పుడు చూస్తారని విష్వక్సేన్ చెప్పుకొచ్చాడు.