Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

‘ఒలికిపోయిన వెన్నెల’ నవల ఆవిష్కరణ

హైదరాబాద్‌ : తెలుగు ఇండస్ట్రీలో ఘన విజయం సాధించిన చూడాలని వుంది, శుభలగ్నం, మావిచిగురు, యమలీల మొదలైన సుమారు వంద చిత్రాలకు కథ, స్క్రీన్‌ ప్లే, సంభాషణలు అందించిన దివాకర బాబు మాడభూషి, తనకున్న అనుభవంతో రాసిన ‘ఒలికిపోయిన వెన్నెల’ నవల సోమవారం సినీ మ్యాక్స్‌లో ప్రముఖ దర్శకులు దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. దివాకర బాబు మాట్లాడుతూ ..వెన్నెల చాలా హాయిగా అందరికి ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఆ వెన్నెల ఒలికిపోతే ఎవరికి అవసరం లేదు. ఎవరూ దాన్ని ఎత్తుకుని దోసిళ్లలోకి తీసుకోలేరు అనే పాయింటును ఒక స్త్రీ పరంగా చెబుతూ, ఒక స్త్రీ అంతరంగ మథనాన్ని ఈ ఒలికి పోయిన వెన్నెల నవలలో ఆవిష్కరించినట్టు చెప్పారు. దర్శకేంద్రుడు ఎంతో బిజీగా ఉన్నా మా విన్నపాన్ని మన్నించి నేను రాసిన నవలను ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img