హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 153 సినిమాగా మోహన్రాజా దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్ఫాదర్’. మలయాళ ‘లూసిఫర్’ చిత్రానికిది అధికారిక రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగుకు తగ్గట్టుగా స్వల్ప మార్పులతో ఈ సినిమా స్క్రిప్ట్ను తీర్చిదిద్దారు దర్శకుడు మోహన్ రాజా. అయితే ఇందులోని ఇతర పాత్రల విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ.. కొన్ని ప్రధాన పాత్రలకు సంబంధిం చిన వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ముఖ్యమంత్రి కూతురి పాత్రలో నయన తార నటిస్తోందని గతంలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత శోభన నటిస్తోందని వార్తలొచ్చాయి. రీసెంట్గా రమ్యకృష్ణ పేరు కూడా వినిపించింది. అయితే గురువారం ‘గాడ్ ఫాదర్’ టీమ్ .. నయనతారకు పుట్టిన రోజులు శుభాకాం క్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో ఆ పాత్రకి నయనతారను ఫిక్స్ చేసినట్టు అర్ధమవుతోంది