హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్ లో ‘గాడ్ ఫాదర్’ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్ స్టోరీలోని ప్లాట్ లైన్ను మాత్రమే తీసుకొని చిరు ఇమేజ్కు తగినట్లుగా దర్శకుడు స్క్రిప్టు రెడీ చేశారు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్తో ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి చిన్న బ్రేక్ పడిరదని టాక్ నడుస్తోంది. ‘గాడ్ ఫాదర్’ ఫైనల్ స్క్రిప్ట్ని లాక్ చేసిన తర్వాతే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అయితే ఈ స్క్రిప్టులో చిరంజీవికి కొన్ని సందేహాలు తలెత్తడంతో మళ్ళీ కీలకమైన మార్పులు సూచించారట. ఇప్పుడు దర్శకుడు మోహన్ రాజా వాటికి అనుగుణంగా సీన్స్ రీ రైట్ చేస్తున్నారట. ఈ కారణంగానే షూటింగ్ ఆలస్యం అవుతోందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ‘ఆచార్య’ పెండిరగ్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయడానికే చిరు ఈ సినిమా నుంచి బ్రేక్ తీసుకున్నారని.. అది అయిపోయిన వెంటనే మళ్లీ తన 153వ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా, నిరవ్ షా సినిమాటోగ్రఫీ, సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు.