విజయవాడ: కార్తీక మాసాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, జీ తెలుగు అభిమానుల కోసం ప్రత్యేకంగా ముస్తాబైంది. ఈ ఆదివారం ఒక కొత్త నాన్ ఫిక్షన్ షోని లాంచ్ చేస్తోంది. అలాగే, తన ప్రియమైన అభిమానుల కోసం ఒక స్పెషల్ కార్యక్రమాన్ని జీ తెలుగు ప్రసారం చేయబోతుంది. ‘సూపర్ క్వీన్’ అనే అపూర్వమైన మహిళా ప్రాధాన్యత కలిగిన మాధ్యానపు రియాలిటీ షోను ఛానల్ మొదటి సారి లాంచ్ చేయబోతోంది. ఈ షో ఆదివారం అంటే 28 నవంబర్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ షోకు ప్రదీప్ మాచిరాజు యాంకర్గా వ్యవరిస్తున్నాడు. శివ జ్యోతి, స్నిగ్ధ, శోభా శెట్టి, పూజ మూర్తి, నవ్య స్వామి, భాను శ్రీ, మధుమిత, శ్రీ సత్య, యాష్మి గౌడ, లాస్య మంజునాథ్ ఈ షోలో కంటెస్టెంట్లు. మొదటి ఎపిసోడ్ లో అందరిని అలరించి మైమరపించడానికి అనుపమ పరమేశ్వరన్, రాజ్ తరుణ్, నిహారిక కొణిదెల ముఖ్య అతిథులుగా రానున్నారు. మరి, ఈ పది మందిలో ఎవరు ‘సూపర్ క్వీన్’ టైటిల్ ను గెలుచుకుంటారో తెలుసుకోవాలంటే ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు చూడాల్సిందే.