హైదరాబాద్: యువ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో డీజే టిల్లుకు సీక్వెల్గా తెరకెక్కుతున్న టిల్లు 2 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నరుడా డోనరుడా ఫేం మల్లిక్రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే డీజే టిల్లును మించిపోయేలా నైజాం ఏరియాలో సీక్వెల్కు మంచి డిమాండ్ ఉందట. డీజే టిల్లు నైజాం ఏరియాలో రూ.7 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టిల్లు
2 పంపిణీ హక్కులకు సంబంధించి రూ.9 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు ఫిలింనగర్లో జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాదు చాలా పంపిణీ సంస్థలు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఈ వార్త సిద్దు జొన్నలగడ్డ సినిమాకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. రెండో పార్టులో అనుపమపరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీకి టిల్లు 2తో మరోసారి కాసుల వర్షం కురవడం ఖాయమని భావిస్తున్నారు.