Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

త్రివిక్రమ్‌`మహేశ్‌ సినిమా కొత్త షెడ్యూల్‌ ప్రారంభం

హైదరాబాద్‌: టాలీవుడ్‌ లో మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కు చాలా క్రేజ్‌ ఉంది. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మూడో చిత్రం రాబోతోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మహేష్‌కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. శ్రీలీల మరో హీరోయిన్‌. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. భారీ సెట్‌ లో మహేష్‌ తో పాటు ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు. షూటింగ్‌ లో పాల్గొనేందుకు పూజా హెగ్డే హైదరాబాద్‌ లో అడుగు పెట్టింది. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో దిగిన ఆమె ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. సల్మాన్‌ ఖాన్‌ తో కిసికా భాయి కిసికా జాన్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఆమె ఇప్పుడు మహేష్‌%–%త్రివిక్రమ్‌ చిత్రంపై పూర్తి ఫోకస్‌ పెట్టనుంది. మహేష్‌ కెరీర్‌లో ఇది 28వ చిత్రం. ఆగస్టు 11న విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్‌ సెట్‌లో మహేష్‌, త్రివిక్రమ్‌ తో దిగిన ఫొటోలను ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘థియేటర్లలో కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన కొడుకు మహేష్‌ తో పని చేస్తున్నాను. మరోసారి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఉగాది కానుకగా.. ఈ సినిమా టైటిల్‌, మహేష్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.
భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్‌ సంస్థ విడుదల చేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img