హైదరాబాద్: అలనాటి నటి రోజా రమణి బాలనటిగానే వెండితెరకి పరిచయమయ్యారు. ఆమె తనయుడిగా తరుణ్ కూడా బాలనటుడిగానే తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత వచ్చిన మరికొన్ని సినిమాలు తరుణ్ ను లవర్ బాయ్ గా నిలబెట్టాయి. తరుణ్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాదాపు పెద్ద పెద్ద బ్యానర్లలోనే ఆయన సినిమాలు చేస్తూ వెళ్లాడు. అయితే వరుస ఫ్లాపుల కారణంగా ఆయన వెనకబడ్డాడు. ఆ సమయంలో బిజినెస్పై దృష్టి పెట్టాడు. అలా సినిమాలకి మరింత దూరమయ్యాడు. ఈ నేపథ్యం లోనే తాజా ఇంటర్వ్యూలో తరుణ్ గురించి రోజా రమణి ప్రస్తావించారు. తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడని, ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఒకటి సినిమా అయితే… మరొకటి వెబ్ సిరీస్. ఏది ముందుగా పూర్తవుతుందనేది చూడాలి. తనని ఇంతకుముందు మాదిరిగానే ప్రేక్షకులు ఆదరించాలనీ, త్వరలోనే తన పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.