హైదరాబాద్ : నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో.. హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘బ్యాక్ డోర్’. ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. సెన్సార్ నుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం విడుదల గురించి నిర్మాత బి. శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. ‘బ్యాక్ డోర్ చిత్రంలో కుర్రకారును కట్టిపడేసే అంశాలతోపాటు.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉన్నాయి. పూర్ణతో పాటు హీరో తేజ చాలా చక్కగా నటించారు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి దీపావళికి సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలుపగా.. తను నటించిన ‘బ్యాక్ డోర్’ చిత్రం క్లీన్ ‘యు’తో రిలీజ్ కానుండడం చాలా సంతోషంగా ఉందని పూర్ణ అన్నారు.