హైదరాబాద్: ఐక్యూ క్రియేషన్స్ బ్యానర్పై ప్రణవచంద్ర, మాళవిక సతీషన్ అజయ్ గోఫ్ు, బిత్తిరి సత్తి, మాస్టర్ చక్రి, జెమిని సురేష్, నటీ నటులుగా శివ నాగేశ్వరావు దర్శకత్వంలో బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘దోచేవారె వరురా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం ద్వారా ప్రణవచంద్ర, ప్రణతి నూతనంగా వెండితెరపై పరిచయమవుతున్నారు. కాగా ఈ చిత్ర దర్శకుడు శివనాగేశ్వరరావు గతంలో ‘వన్ బై టూ, లక్కీ ఛాన్స్, మనీ మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం, వామ్మో వాత్తో ఓ పెళ్ళామా, ఓపనై పోతుంది బాబు, హ్యాండ్సప్’ లాంటి వరుస వైవిధ్య హాస్య కథలతో జనాన్ని అలరించారు. తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, ఫోటో, భూకైలాస్’ బాగున్నాయనిపిం చాయి. తాజాగా మరోసారి ఆయన నవ్వించటానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు తన కొత్త చిత్రం ట్రైలర్ సైతం వదిలారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ చిత్ర ట్రైలర్ను విడుదల చేయగా, నటులు ఉత్తేజ్, హర్ష వర్ధన్, దర్శకులు ప్రణీత్లు చిత్ర యూనిట్కు బెస్ట్ విషెష్ తెలియజేశారు.