హైదరాబాద్ : బబ్లీ బ్యూటీ రాశి ఖన్నాకి టాలీవుడ్లో వాళ్లంటే చాలా ఇష్టం అంటున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు వరుస తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో ఐదు తమిళ సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘అరణ్మనై`3’, ‘సర్దార్’ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఆశించిన సక్సెస్ సాధిస్తే మాత్రం కోలీవుడ్లో ఆమె క్రేజ్ విపరీతంగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. తెలు గులో నాగచైతన్యకి జంటగా ‘థ్యాంక్యూ’, గోపీచంద్ సరసన హీరో యిన్గా ‘పక్కా కమర్షియల్’ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సిని మాలు కూడా తనకి మంచి హిట్ ఇస్తాయని చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక తాజాగా తనకి ఇష్టమైన టాలీవుడ్ హీరోలు .. హీరో యిన్ల గురించి రాశి ఖన్నా ఇన్స్టాలో తెలిపింది. ‘హీరోలం దరూ నాకు ఇష్టమే. అయితే ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. అంతేకాదు అల్లు అర్జున్ డాన్స్కి నేను పెద్ద అభిమానిని. అలాగే హీరోయిన్లలో అనుష్క శెట్టి, సమంత అంటే బాగా ఇష్టం. వాళ్లలా నటించాలని ఉంటుంది’ అని పేర్కొంది.