హైదరాబాద్: యంగ్ హీరో నితిన్, నేషనల్ క్రష్ రష్మికల కొత్త చిత్రం ప్రారంభమైంది. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంచ్ అయింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజర య్యారు. ముహూర్తం షాట్ను ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించారు. అలాగే దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, బుచ్చిబాబు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. వీళ్ల ముగ్గురి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడం.. చిరంజీవి ప్రారంభించడంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడిరది. అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ స్వరాలు అందిస్తున్నారు. ఇక గతంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికలు ‘భీష్మ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం సూపర్ హిట్గా నిలిచి మంచి కలెక్షన్లు రాబట్టింది.
దీని తర్వాత వెంకీ కుడుముల చిరంజీవితో ఓ మూవీ ప్లాన్ చేశారు. స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉండటంతో ఆ చిత్రం కొంత ఆలస్యమవుతోంది.