Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

‘పక్కా కమర్షియల్‌’ టీజర్‌ వచ్చేసింది

హైదరాబాద్‌ : గోపీచంద్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. రాశీఖన్నా కథానాయిక. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. గోపీచంద్‌ చెప్పిన సంభాషలు ఆకట్టుకునేలా ఉన్నాయి. టైటిల్‌కి తగ్గట్టు సినిమాలో కమర్షియల్‌ హంగులు పక్కాగా ఉన్నాయని టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది.‘ఎవరికి చూపిస్తున్నారు సర్‌ మీ విలనిజం? మీరిప్పుడు చేస్తున్నారు. నేనెప్పుడో చేసి, చూసి వచ్చేశా’ అంటూ గోపీచంద్‌, ‘ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్‌ పెట్టకూడదు.. ఇలా పెట్టాలి’ అంటూ రాశీఖన్నా చేసే హడావుడి సరదాగా ఉంది. కోర్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గోపీచంద్‌, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు. మరి లాయరైన గోపీచంద్‌ విలనిజం గురించి చెప్తూ ఎవరికి వార్నింగ్‌ ఇచ్చారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. జాక్స్‌ బెజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img