హైదరాబాద్ : ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘క్షణం’లో ఏసీపీ జయ భరద్వాజ్ పాత్రలు అనసూయకు ఎంతగా గుర్తింపు తెచ్చాయో తెలిసిందే! ఇప్పుడు అంతకుమించి గుర్తింపు తెచ్చే ఓ పాత్ర చేస్తున్నారట అనసూయ. తాజాగా ఆమె ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణి పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన లుక్తో అనసూయ పాత్ర అదిరిపోతుందని అంతా భావిస్తున్నారు. గత పాత్రల కన్నా బాగా గుర్తింపు తెచ్చే పాత్ర కూడా ఇదేనని అనుకుంటున్నారు. అయితే అనసూయ దృష్టి మాత్రం మరో పాత్ర మీద ఉందట. ‘పుష్ప’ సినిమా కాకుండా సైలెంట్గా మరో సినిమా చేస్తున్నారు అనసూయ. జయశంకర్ ఆ చిత్రానికి దర్శకుడు. ఇందులో నాయికగా అనసూయది చాలా కీలకమైన పాత్ర అట. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో అనసూయ ఎయిర్ హోస్టెస్గా నటిస్తున్నారు. ఈ పాత్రతో అనసూయకు మరింత క్రేజ్ పెరుగుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్లో రెండో షెడ్యూల్కి వెళ్లబోతుంది.