చాలా గ్యాప్ తర్వాత మణిరత్నం తన ప్రతిభను మరోసారి చూపించేందుకు రెడీ అయ్యారు.1995లో కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవలా ఆధారంగా ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రాన్ని మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, విక్రమ్ ప్రభు, త్రిష, మోహన్ బాబు, ఐశ్వర్యా రాయ్, తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయబోతోన్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక త్వరలోనే మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. రవి వర్మన్ కెమెరామెన్గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.