Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభాస్‌ తదుపరి చిత్రం పౌరాణికం!

హైదరాబాద్‌: హీరో ప్రభాస్‌ తదుపరి సినిమా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రాబోతోందని అగ్ర నిర్మాత దిల్‌ రాజు వెల్లడిరచారు. అది కూడా పౌరాణికమని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబోలో ‘సలార్‌’ సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతోంది. భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇది పూర్తి కాగానే.. వీరిద్దరి కాంబినేషన్‌ లోనే మరో సినిమా వస్తుందని దిల్‌ రాజ్‌ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలోనే పౌరాణిక సినిమా రాబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా రెడీ చేశారు. సలార్‌ తర్వాత.. ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ సినిమా చేస్తారు. ఆ తర్వాత ప్రభాస్‌ సినిమా మొదలవుతుంది. అయితే ఈ చిత్రం ఇంకా చర్చల దశలో ఉంది’’ అని వివరించారు. మరోవైపు సలార్‌ టీజర్‌ జూన్‌ లో విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్‌ సినిమా విడుదలైన వెంటనే… టీజర్‌ రిలీజ్‌ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సలార్‌ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 28న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img