ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. బింబిసార, సీతారామం చిత్రాల విజయం.. ఇండస్ట్రీకి ఊపిరిపోసిందని అన్నారు. ఒక సినిమాకు దర్శకుడు, నిర్మాత, హీరోనే ముఖ్యమని ఈ ముగ్గురు ఉంటేనే సినిమాను ఏ స్థాయికైనా తీసుకెళ్లవచ్చని దిల్ రాజు తెలిపారు. ఈ నెల ఫస్ట్ నుంచి షూటింగులు నిలిపేశామని భవిష్యత్ కోసం ఆలోచనలు చేస్తున్నట్లు వివరించారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిందని చెప్పుకొచ్చారు. జూన్లో రెండు, ఈ నెలలో బింబిసార, సీతారామం వంటి సినిమాలు విడుదలై ఇండస్ట్రీకి ఊపిరిపోశాయన్నారు.