Friday, April 19, 2024
Friday, April 19, 2024

మరో మైలురాయి చేరుకున్న కే.జీ.ఎఫ్-2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం ాకే.జీ.ఎఫ్ ఛాప్టర్-1్ణ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. మాస్ ఫైటింగ్‌లు, అద్భుతమైన సెట్టింగ్‌లు, భారీగా ఎలివేషన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతీ అంశం యావత్ భారతదేశ్ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకుంది. అద్భుతమైన క్లైమాక్స్‌తో ముగిసిన ఈ సినిమా తదుపరి కథ ాకే.జీ.ఎఫ్ ఛాప్టర్-2్ణలో తెలియనుంది. దీంతో ఒకప్పుడు బాహుబలి-2 కోసం ఎలా ఎదురుచూశారో.. ఇప్పుడు ఈ సినిమా కోసం అంతకంటే రెట్టింపుగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. తెరపై యశ్‌ని మరోసారిగా ారాకీ భాయ్‌్ణగా చూడాలని.. అతన్ని యాక్షన్‌ని చూస్తూ థియేటర్లలో ఈలలతో గోల చేయాలని ఎన్నో ప్లాన్లు వేశారు. నిజానికి అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ రోజు(జూలై 16న) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సింది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదాపడింది. సినిమా థియేటర్లు పూర్తిగా తెరుచుకొని.. మళ్లీ 100 శాతం ప్రేక్షకులు ఎప్పుడు థియేటర్లకు వస్తారో.. అప్పుడే తమ సినిమాను విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ ఆ మధ్య ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ టీజర్ తాజాగా 200 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే బీజీఎమ్, యాశ్ యాక్షన్, ప్రశాంత్ నీల్ టేకింగ్.. ఇలా ప్రతీ అంశం టీజర్‌ను ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇక సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టండన్‌లో ఈ టీజర్‌లో ఒక క్షణం పాటు కనిపిస్తారు. అన్నిటికన్న క్లైమాక్స్ టీజర్‌కి హైలైట్ అని చెప్పుకోవాలి. తాజాగా ఈ టీజర్ 200 మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేయడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. ామీ గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిసి.. మా మాన్‌స్టర్‌కి తిరుగులేకుండా చేశారు్ణ అంటూ ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img