హైదరాబాద్: ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అమెరికా పర్యట నలో ఉన్న సంగతి విదితమే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి, ఎంఎం కీరవాణి అక్కడి మీడియాతో సమావేశం కాగా, తాజాగా సోమవారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్ వేడుకల కోసం అమెరికా వెళ్లారు. ముందుగానే తారక్ వెళ్లాల్సి ఉన్నా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు ఆయ నకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానానికి పదాలు లేవని, అంతకు మించిన అభిమానం తన గుండెల్లో ఉందని అన్నారు తారక్. ‘‘మీరు చూపిస్తున్న అభిమానానికి పదాలు కనిపెట్టలేను. మీరు నాపై చూపి స్తున్న అభిమానానికి వందరెట్లు అభిమానం నా గుండెల్లో ఉంది. అది నేను చూపించలేకపోతున్నాను. మన మధ్య ఏ రక్త సంబంధం లేదు. నేనేం చేసి మీకు దగ్గరయ్యానో నాకు తెలియడం లేదు. మీరందరూ నా సోదరుల కంటే ఎక్కువ. మనది రక్త సంబంధం కంటే గొప్పదైన బంధం. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను’’ అని అన్నారు తారక్. అభిమానులు చూపించే ప్రేమకు తాను రుణపడిపోయానని చెప్పారు. అలాగే ఇంకో జన్మంటూ ఉంటే ఈ అభిమానం కోసమే పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.