హైదరాబాద్: 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేస్తున్న అరుదైన జానపద కళాకారుడు మొగులయ్యకి పవర్స్టార్ పవన్కల్యాణ్. రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈమేరకు మొగులయ్యకు చెక్కును అందజేశారు. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డాక్టర్ దాసరి రంగాకు కూడా పవన్ కల్యాణ్ రూ.50 వేల చెక్కు అందించి సత్కరించారు. ఇటీవల మొగులయ్య ‘భీమ్లా నాయక్’ చిత్రంలోని పరిచయ గీతానికి సాకీ ఆలపించడంతోపాటు… ఆ పాటకి తన కిన్నెర స్వరాల్ని అద్దారు. దీనికి చక్కటి స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్యకి పవన్కల్యాణ్ తన ట్రస్ట్ ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ నుంచి రూ.2 లక్షలను సాయంగా అందించారు.
దీపిక ఉదారత్వం : కొన్ని కారణాల వల్ల గతంలో డిప్రెషన్కు గురైన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే.. తనలాగా మరెవరూ కాకూడదని ‘ది లివ్ లవ్ లాఫ్’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థతో మానసిక రోగులకు కొత్త జీవితాన్ని అందిస్తూనే తనకు వీలు చిక్కినప్పుడల్లా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతూ అందరిలో అవగాహన పెంచుతోంది. ఇటీవల ఫ్రంట్లైన్ ఆర్టిస్ట్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారామె. అలాగే ఇబ్బందుల్లో ఉన్నవారిని కూడా దీపిక ఆదుకుంటోంది. ఈ మధ్య ఆమె అలాంటి ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. బాల ప్రజాపతి అనే యాసిడ్ దాడి బాధితురాలిని ఆదుకోవడానికి ముందుకొచ్చింది. మూత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆమెకు మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్ కోసం రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకుంది.