Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రానాను ప్రశ్నించిన ఈడీ

హైదరాబాద్‌ : తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోన్న మాదకద్రవ్యాల కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. బుధవారం నటుడు రానాను ఈడీ అధికారులు విచారించారు. ఏడు గంటలకుపైగా ఈ విచారణ సాగింది. ప్రధాన నిందితుడు కెల్విన్‌తో లావాదేవీల గురించి రానాను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. కెల్విన్‌ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. అయితే, మనీ లాండరింగ్‌ కోణంలో రానా బ్యాంకు ఖాతాల లవాదేవీలను కూడా అధికారులు పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీల గురించి ప్రశ్నించారని తెలిసింది. ఎఫ్‌ క్లబ్‌ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్‌ అమ్మకందారు కెల్విన్‌తో పాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన ఈడీ అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img