హైదరాబాద్ : మెగా హీరో రామ్ చరణ్ మరో భారీ సినిమాను మొదలుపెట్టనున్నాడు. కార్తికేయ, కార్తికేయ2 సినిమాల దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన డైరెక్టర్ చందు మొండేటి ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు. ‘కార్తికేయ 2 రిలీజ్కి ముందే గీతా ఆర్ట్స్లో ఒక సినిమాను ఒప్పుకున్నాను. కానీ కుదరలేదు. దాంతో కార్తికేయ 2 తీశాను. ఆ సినిమా రిలీజ్ తరువాత అరవింద్ గారు దగ్గరకి వచ్చి… రామ్చరణ్, హృతిక్ లాంటి వాళ్లతో మూవీ చేద్దాం అనుకుంటున్నాము. అటువంటి కథ ఏమన్నా నీ దగ్గర ఉందా? అని అడిగారు. అలాంటి కథ నా దగ్గర ఉండడం, అది అరవింద్ గారికి నచ్చడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది’ అని చందు మొండేటీ తెలిపారు. అంతేకాదు… ఆ సినిమా రామ్ చరణ్తో ఉండబోతోందని, దానికి దాదాపు 300 కోట్ల బడ్జెట్ అవుతుందని వెల్లడిరచాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం చరణ్… తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్తో గేమ్ ఛేంజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత దర్శకుడు బుచ్చిబాబు సనాతో పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత చందు మొండేటి సినిమా ఉంటుందని సమాచారం.